నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
జాతీయ టైలరింగ్ డే సందర్భంగా శనివారం చౌటుప్పల్ పట్టణంలో టైలర్లు ఘనంగా వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని జాతీయ రహదారిపై బ్యానర్తో ర్యాలీ చేపట్టి, అనంతరం కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు.ఈ సందర్భంగా చౌటుప్పల్ జెంట్స్ అండ్ లేడీస్ టైలర్స్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు మార సంగమేశ్వర్ మాట్లాడుతూ టైలర్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.టైలర్లకు ఉచిత విద్యుత్, బీమా పాలసీలు, హెల్త్ కార్డులు, తక్కువ వడ్డీ రుణాలు మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
50 సంవత్సరాలు దాటిన దర్జీలకు పెన్షన్ కల్పించాలని,ఇల్లు లేని నిరుపేద టైలర్లకు స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు.టైలర్స్ డే సందర్భంగా గౌరవ అధ్యక్షులు ఆదిమూలం శంకర్ రాపోలు ఈశ్వర్లను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు దశరథ, ప్రధాన కార్యదర్శి గుంటి వెంకటేశ్వర్లు, కోశాధికారి బడుగు కృష్ణ, భువనేశ్వర్, కనకయ్య, కృష్ణ, సోమేశ్, వెంకటేష్, నరసింహ, యాదగిరి, గణేష్, భాస్కర్, రవి, ప్రహల్లాద్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.



