- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ప్రతి పేదవారికి ఇల్లు అందించే లక్ష్యంతో కాంగ్రెస్ నాయకులు పేద కుటుంబానికి గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి పాల్గొన్నారు, టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్ధం ఇంద్రకరణ్ రెడ్డి, గ్రామ సర్పంచ్ తుడుం పద్మ స్వామి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిద్ధ రాములు, పంచాయతీ సెక్రటరీ దయాకర్ రెడ్డి, హౌసింగ్ ఏఈ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, గ్రామ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



