– టన్ను గెలలు ధర రూ.21,546 లు-
-మంత్రి తుమ్మల చిత్తశుద్ధి కి నిదర్శనం అంటూ కితాబు
– ఫిబ్రవరి నెల గెలలు ధర ప్రకటించిన చైర్మన్ జంగా రాఘవరెడ్డి
నవతెలంగాణ – అశ్వారావుపేట
పామాయిల్ రైతులకు కు ఆయిల్ఫెడ్ ఈ నెల ఒకటో తారీఖు నే శుభం పలికింది.ఫిబ్రవరి కి టన్ను గెలలు ధర రూ.21,456 లు నిర్ణయిస్తూ ఆదివారం ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి శుభవార్త పైరకటించారు.ఈ ఘనత రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు రైతులు పట్ల ఉన్న చిత్త శుద్ధి కి నిదర్శనం అంటూ కితాబు ఇచ్చారు.ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి మాట్లాడుతూ ఆయిల్ పాం రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన శుభవార్తల నేపథ్యంలో, రైతు సోదరులకు క్రింది అంశాలను వివరించారు.
– క్రూడ్ పామ్ ఆయిల్ (సీపీఓ) – ముడి ఫాం ఆయిల్ అంతర్జాతీయ ధరల పెరుగుదలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ చొరవతో, 2026 ఫిబ్రవరి నెలకు గాను ఆయిల్ పాం గెలల ధర టన్నుకు రూ.21,546 లు నిర్ణయించామన్నారు.
– 2025 జనవరి నెల ధర రూ.12,534 లు తో పోలిస్తే 2026 జనవరి లో గణనీయమైన పెరుగుదల చోటు చేసుకుంది.ఇది రైతులకు ప్రత్యక్ష ఆర్థిక లాభం అన్నారు.
– ఈ ఏడాది (2025) జనవరి లో టన్ను గెలలు ధర 20,456 లు ఉండగా ఫిబ్రవరి లో టన్ను గెలలు కి రూ 21,546 లు గా నిర్ణయించారు.
– ప్రస్తుత ధరల ప్రకారం ఒక్క టన్నుకు సుమారు రూ.1,090 లు అదనపు లాభం రైతులకు అందుతుంది అన్నారు.
– రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 70 లక్షల ఎకరాల్లో ఆయిల్ పాం సాగు విస్తరించింది.
– 1992 నుండి ఇప్పటివరకు 2.90 లక్షల ఎకరాలకు పైగా విస్తరణ జరగడం గర్వకారణం.
– 15,024 మంది రైతులు 68,600 ఎకరాల్లో సాగు చేస్తూ స్థిరమైన ఆదాయం పొందుతున్నారు.
– రాష్ట్ర సగటు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేటు (ఓఈఆర్) 20.01% గా ఉండటం, రైతుల ఉత్పాదకత మెరుగుదలని సూచిస్తోంది.
– దేశంలో ఉత్పత్తి అయ్యే పామాయిల్లో 98% వాటా తెలంగాణ రాష్ట్రానిదే కావడం మన రాష్ట్ర రైతుల కృషికి నిదర్శనం.
– పంట పూర్తిస్థాయిలో దిగుబడికి వచ్చిన 25 – 30 సంవత్సరాల వ్యవధిలో ఎకరానికి సుమారు రూ.1,50,000 లు వరకు వార్షిక ఆదాయం పొందే అవకాశం ఉంది.
– ఆయిల్ పాం సాగులో మార్కెటింగ్ భారం రైతులపై లేకుండా, కోత నుండి మిల్లుకు రవాణా వరకు రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆయిల్ ఫెడ్ సమన్వయం చేస్తోంది.
– ప్రజా ప్రభుత్వం “రైతే రాజు” అన్న నినాదాన్ని కార్యరూపం దాల్చిస్తూ, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోంది.
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆయిల్ పాం సాగు విస్తరణ,ధర స్థిరీకరణ,రైతుల ఆదాయ వృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు.
– రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు రైతుల ఆర్థిక స్థిరత్వానికి,గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడుతున్నాయి.
– ఆయిల్ పాం సాగు ద్వారా రైతు కుటుంబాలకు దీర్ఘకాలిక ఆదాయం, భరోసా,అభివృద్ధి సాధ్యమవుతోంది.
– రైతు సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆయిల్ పాం సాగును మరింత విస్తరించాలని కోరుతున్నాను.రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫెడ్ ఎల్లప్పుడూ రైతుల పక్షానే నిలుస్తాయి అని ఆయన ప్రకటించారు.
పామాయిల్ రైతులకు ఆయిల్ఫెడ్ శుభవార్త
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



