– “ఇగ్నైట్: ది సైన్స్ ఎక్స్పో” ఘనంగా నిర్వహణ
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి లోని ఆర్కిడ్స్ హై స్కూల్లో జాతీయ సైన్స్ డే సందర్భంగా శనివారం “ఇగ్నైట్: ది సైన్స్ ఎక్స్పో” పేరుతో జాతీయ సైన్స్ ఫెయిర్ను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ భారత శాస్త్రవేత్త సివి రామన్ కనుగొన్న రామన్ ప్రభావాన్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థులు వివిధ శాస్త్రీయ నమూనాలు, ప్రాజెక్టులు ప్రదర్శించారు. పర్యావరణ పరిరక్షణ, పునర్వినియోగ శక్తి వనరులు, స్మార్ట్ సిటీ నమూనాలు, రోబోటిక్స్, అంతరిక్ష విజ్ఞానం, ఆరోగ్యం, పరిశుభ్రత, వ్యవసాయ ఆవిష్కరణలు వంటి అంశాలపై విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు సందర్శకులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు తమ ప్రాజెక్టుల పని విధానం, ప్రయోజనాలను ధైర్యంగా వివరించారు. పాఠశాల చైర్మన్, ప్రిన్సిపాల్ సి.హెచ్.గోవర్ధన్ రెడ్డి అన్ని ప్రాజెక్టులను సందర్శించి విద్యార్థులను అభినందించారు. వారు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత పెంపొందించుకోవాలని ప్రోత్సహించారు.డైరెక్టర్ లు ఎం. సదాశివ రెడ్డి , వైస్ ప్రిన్సిపాల్ ఎం. భూలక్ష్మి , డైరక్టర్ సి.హెచ్.వసంత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను, సైన్స్ టీచర్లను అభినందించారు. సైన్స్ ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం వల్లే ఈ కార్యక్రమం విజయవంతమైందని పేర్కొన్నారు. సిబ్బంది విద్యార్థులందరూ ఉత్సాహంగా పాల్గొని ఈ సైన్స్ ఫెయిర్ను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించడంతో పాటు, వారి ఆత్మవిశ్వాసం ప్రదర్శన నైపుణ్యాలను మెరుగుపరిచింది.ఆర్కిడ్స్ హై స్కూల్ నిర్వహణ భవిష్యత్తులో కూడా ఇలాంటి విద్యా కార్యక్రమాలను నిర్వహించి విద్యార్థులను ఆవిష్కరణల దిశగా ప్రోత్సహిస్తామని తెలిపారు.
ఆర్కిడ్స్ హై స్కూల్లో జాతీయ సైన్స్ ఫెయిర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



