Sunday, June 1, 2025
E-PAPER
Homeజాతీయంప్ర‌ధాని మోడీపై జైరాం ర‌మేష్ సెటైర్లు

ప్ర‌ధాని మోడీపై జైరాం ర‌మేష్ సెటైర్లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కాంగ్రెస్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ జైరాం ర‌మేష్ ప్ర‌ధాని మోడీపై సెటైర్లు వేశారు. “మన ప్రధానమంత్రి సుంకాల గురించి వినడానికి ఇష్టపడరు, మన ప్రధానమంత్రి ‘తరీఫ్’ (ప్రశంసలు) మాత్రమే వినాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్ర‌శంస‌ల‌కు పొంగిపోయి..దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను దెబ్బ‌తీస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై బీజేపీప్ర‌భుత్వం మౌనం వ‌హించ‌డం స‌మంజ‌సం కాద‌ని ఆయ‌న సూచించారు. అమెరికా ద్వంద్వ వైఖ‌రీపై ప్ర‌ధాన మంత్రి ఏమి మాట్లాడంలేద‌ని విమ‌ర్శించారు. ట్రంప్ నిర్ణ‌యాల‌పై ఆదేశ సుప్రీం కోర్టు ప‌లు ఆంక్ష‌లు విధించినా..భార‌త్ ప్ర‌ధాని మౌనంగా ఉంటున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. అంతేకాకుండా భార‌త్‌-పాక్ దేశాల మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ ఒప్పందంలో..ట్రంప్ జోక్యమేంట‌ని కేంద్రాన్ని ప్ర‌శ్నించారు. ఈ వ్య‌వ‌హారంలో యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్..త‌న జోక్యం వ‌ల్లే రెండు దేశాలు యుద్ధానికి ముంగిపు ప‌లికాయాని బీరాలు పలుకుతున్నార‌ని, ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను బీజేపీ ప్ర‌భుత్వం ఖండించ‌క‌పోవ‌డంలో మ‌ర‌మ్మేంట‌ని జైరాం ర‌మేష్ మండిప‌డ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -