- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ హౌసింగ్ బోర్డు క్యూర్ పరిధిలో చేపట్టనున్న ఎల్ఐజీ గృహ నిర్మాణ పథకానికి లోగో డిజైన్ పోటీని ప్రకటించింది. ఉత్తమ లోగో రూపొందించిన విజేతకు రూ.1 లక్ష నగదు బహుమతి అందజేయనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి. గౌతమ్ తెలిపారు. ఆసక్తి ఉన్న డిజైనర్లు, విద్యార్థులు, కళాకారులు జులై 12లోపు @tghd.official ఇన్స్టాగ్రామ్లోని గూగుల్ ఫారమ్ ద్వారా తమ లోగోలను పంపవచ్చు. ఎంపికైన లోగోను అధికారిక ప్రచారంలో ఉపయోగించనున్నారు.
- Advertisement -



