- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఐసీసీ షెడ్యూల్ ప్రకారం ఐసీసీ సమావేశం ఖతార్ రాజధాని దోహాలో మార్చి 25 నుంచి 27 వరకు జరగాల్సి ఉంది. కానీ ప్రస్తుతం మరుసటి నెలకు వాయిదా వేసినట్లు సమాచారం. శనివారం ఈ సమాచారాన్ని ఐసీసీ సభ్యులకు అందించినట్లు తెలుస్తోంది. ఐసీసీ బోర్డు డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్లు, కమిటీ సభ్యులు, సీనియర్ అధికారులు.. ఈ సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. ఖతార్లో క్రికెట్కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ కారణంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి ఈ సమావేశానికి వేదికగా ఖతార్నే ఎంచుకుందని ఐసీసీ వర్గాలు తెలిపాయి.
- Advertisement -



