Monday, March 9, 2026
E-PAPER
Homeఖమ్మంచెత్త డ్రమ్ములను ఏర్పాటు చేయటం పట్ల సర్పంచ్ కు అభినందనలు

చెత్త డ్రమ్ములను ఏర్పాటు చేయటం పట్ల సర్పంచ్ కు అభినందనలు

- Advertisement -

జిల్లా పంచాయతీ అధికారి తేజావత్ రాంబాబ
నవతెలంగాణ – బోనకల్ 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి తేజావత్ రాంబాబు అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ గ్రామంలో పల్లె ప్రగతి పనులను ఆదివారం ఆయన ఎంపీడీవో రురావత్ రమాదేవి తో కలిసి పరిశీలించారు. గ్రామంలో చేపట్టిన పారిశుధ్య పనులను కూడా ఆయన పరిశీలించారు.రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ప్రజా పాలన – ప్రగతి పాలన కార్యక్రమాన్ని బోనకల్ మండల కేంద్రంలో సర్పంచ్ బానోతు జ్యోతి, ఉప సర్పంచ్ బానోతు కొండ ప్రారంభించారు. గ్రామంలో అనేక వీధులలో పారిశుద్ధ్య పనులు ప్రారంభించారు.

గ్రామంలో డ్రైనేజీలు బాగు చేయుట, రోడ్లకు ఇరువైపులు ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈ పారిశుధ్య పనులను డిపిఓ ఎంపీడీవో పరిశీలించారు. అయితే గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా గ్రామ సర్పంచ్ ప్రత్యేకంగా చెత్త డ్రమ్ములను గ్రామంలోని ప్రధాన కూడలలో ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎక్కడ లేని విధంగా చెత్త డ్రమ్ములను విస్తృతంగా ఏర్పాటు చేయడాన్ని చూసి డిపిఓ, ఎండిఓ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చెత్త డ్రమ్ములను ఏర్పాటు చేయటం పట్ల సర్పంచిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి పనిని అధికారులు గ్రామపంచాయతీ పూర్తి చేయాలని సూచించారు. ప్రధానంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉంటారన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన –  ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని రూపొందించింది అన్నారు.

ఈ 99 రోజులపాటు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. అనంతరం బోనకల్ గ్రామ అఖిలపక్ష నాయకులు ప్రజా పాలన-ప్రగతి పాలన బ్యానర్ పట్టుకొని వీధుల వెంట తిరుగుతూ పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోతు జ్యోతి ఉపసర్పంచ్ బానోత్ కొండ గ్రామ పంచాయతీ కార్యదర్శి కోల రాజేశ్వరి, ఏపిఎం కొట్టే వెంకటేశ్వర్లు, అఖిలపక్ష నాయకులు గుండపనేని సుధాకర్ రావు, తేళ్లూరి రమేష్, చిట్టోజు శ్రీనివాస్ గాలి దుర్గారావు, తోటపల్లి స్వామి, తెల్లాకుల శ్రీనివాసరావు, గుగులోతు నాగేశ్వరరావు, గంగుల శ్రీనివాసరావు, గుగులోతు రమేష్, గంగుల పుల్లయ్య, బానోతు లక్ష్మి, పాసంగులపాటి కోటేశ్వరరావు, ఉప్పర శ్రీను, అంతోటి శ్రీను, షేక్ షేక్ మీరా సాహెబ్, మరీదు శేషు, గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్స్ మంద నాగరాజు, మరీదు కుమారి, గాదె వెంకటేశ్వర్లు, అంతోటి రమేష్, ధరావత్ బాలకృష్ణ, గుగులోతు వెంకటేశ్వర్లు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -