- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికాల మధ్య రేగిన ఉద్రిక్తతలు ఇప్పుడు ఇతర దేశాల పౌరుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. వ్యూహాత్మక హర్మూజ్ జలసంధిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చెందిన రెండు జాతీయ చమురు నౌకలపై ఇరాన్ జరిపిన భారీ క్షిపణి దాడిలో ఒక భారతీయ నౌకా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆరుగురు భారతీయులు, ఇద్దరు ఉక్రెయిన్ పౌరులు ఉన్నారని, వారిలో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు.
- Advertisement -



