- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లిలో తీవ్ర విషాదం జరిగింది. కుటుంబ కలహాల వల్ల ఎనుముల శిరీష (23) తన కుమార్తె మానశ్రీ (3), నాలుగు నెలల కుమారుడు వర్షిత్ను నీటి సంపులో వేసి, తానూ దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాల గురించి ఆరా తీస్తున్నారు.
- Advertisement -



