- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీలోని జంతర్మంతర్ వేదికగా 21 రోజులుగా ఆయన దీక్ష చేపడుతున్నారు. సోనమ్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. దీనికి వ్యతిరేకంగా వాంగ్చుక్ మద్దతుదారులు ఆందోళన చేస్తున్నారు. కాగా నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
- Advertisement -



