- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జులై 23 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమ, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు, గంటకు 50–70 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వెల్లడించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో జులై 21 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. బీచ్ల వద్ద అలలు ఉద్ధృతంగా ఉండనున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
- Advertisement -



