- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతూనే ఉన్నది. ఇవాళ ఒడిశాలోని కలహాండి జిల్లాలో ఆ రాష్ట్ర డీజీపీ వై.బి. ఖురానియా సమక్షంలో డివిజనల్ కమిటీ సబ్యుడు నకుల్ సహా మొత్తం11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఐదుగురు ఏరియా కమిటీ సభ్యులు, మరో ఐదుగురు పార్టీ క్యాడర్లు ఉన్నారు. వీరంతా ఒక AK-47 రైఫిల్, ఒక ఇన్సాస్, నాలుగు ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు, నాలుగు సింగిల్ షాట్ తుపాకులు, భారీగా మందుగుండు సామాగ్రిని పోలీసులకు అప్పగించారు.
- Advertisement -



