Friday, July 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజల పత్రిక నవతెలంగాణ

ప్రజల పత్రిక నవతెలంగాణ

- Advertisement -

ఆహ్వాన ప‌త్రిక‌ను అంద‌జేసిన సీజీఎం ప్ర‌భాక‌ర్‌, ఎడిట‌ర్ రాంప‌ల్లి ర‌మేశ్
టీపీసీసీ చీఫ్‌ మ‌హేశ్ కుమార్ గౌడ్

న‌వ‌తెలంగాణ బ్యూరో – హైద‌రాబాద్
​ప‌ది వ‌సంతాల‌ను దిగ్విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుని ప‌ద‌కొండో వ‌సంతంలోకి అడుగు పెడుతున్న న‌వ‌తెలంగాణ ప్రజల దిన‌ప‌త్రిక.. మున్ముందు ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ‌ను మ‌రింత‌గా చూర‌గొనాల‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మ‌హేశ్ కుమార్ గౌడ్ ఆకాంక్షించారు. ఈ సంద‌ర్భంగా ప‌త్రిక యాజ‌మాన్యానికి, విలేక‌రులు, సిబ్బందికి ఆయ‌న శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆగ‌స్టు ఒక‌టిన నిర్వ‌హించ‌బోయే వార్షికోత్స‌వానికి త‌ప్ప‌కుండా వ‌స్తాన‌ని ఆయ‌న హామీనిచ్చారు. గురువారం హైద‌రాబాద్‌లోని గాంధీ భ‌వ‌న్‌లో వార్షికోత్స‌వ ఆహ్వాన ప‌త్రిక‌ను న‌వ‌తెలంగాణ సీజీఎం పి.ప్ర‌భాక‌ర్‌, ఎడిట‌ర్ రాంప‌ల్లి ర‌మేశ్… మ‌హేశ్ కుమార్ గౌడ్‌కు అంద‌జేశారు. వార్షికోత్స‌వానికి త‌ప్ప‌కుండా రావాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా దేశంలోని ప్ర‌స్తుత ప‌రిస్థితులు, రాజ‌కీయ ప‌రిణామాలు, ఢిల్లీలో విద్యార్థుల ఉద్య‌మం, బీజేపీ ప్ర‌భుత్వ ద‌మ‌న‌కాండ త‌దితరాంశాల‌పై వారు చ‌ర్చించారు. ఆహ్వాన ప‌త్రిక అంద‌జేసిన వారిలో న‌వ‌తెలంగాణ స్టేట్ బ్యూరో చీఫ్ బివిఎన్ ప‌ద్మ‌రాజు, జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్లు ఎ.వెంక‌టేశ్‌, ర‌ఘు, శ‌శిధ‌ర్ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -