Monday, March 16, 2026
E-PAPER
Homeఆటలువన్డే, టెస్టులు అందుకే ఆడటం లేదు: సూర్యకుమార్‌ యాదవ్‌

వన్డే, టెస్టులు అందుకే ఆడటం లేదు: సూర్యకుమార్‌ యాదవ్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : భారత టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. వన్డే, టెస్టులు ఎందుకు ఆడరని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘‘జీవితంలో ఏది రాసి ఉంటే.. అదే జరుగుతుంది. నేను 10-12 ఏళ్లు రంజీ ట్రోఫీల్లో రెడ్‌ బాల్‌ క్రికెట్ ఆడాను. కానీ క్రమంగా వైట్ బాల్ క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు.. ఇటు వైపు మొగ్గు చూపడం ప్రారంభమైంది. ఆ తర్వాత, టీ20 ఫార్మాట్‌కి వచ్చాను.. పట్టు సాధించాను. వన్డే క్రికెట్‌లో బాగా ఆడటానికి చాలా ప్రయత్నించాను, కానీ అక్కడ ఏమీ జరగలేదు’’ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -