నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో సోమవారం నాడు ఇందిరమ్మ గృహ పథకంలో నూతన గృహ ప్రవేశం జుక్కల్ ఎంపిడివో రాము రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ రమణ సురేష్ గొండ , ఎంపిఓ రాము మాట్లాడుతూ బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు మొత్తం 31 మంజూరు కాగా.. స్లాబ్ లెవెల్ 9, రూమ్ లెవెల్ 6, బేస్మెంట్ లెవెల్ 4. ప్రోగ్రెస్ లో 8 ఉన్నాయని అన్నారు. సోమవారం ఒక ఇల్లు పూర్తి చేసుకొని గృహ ప్రవేశం చేసారు.
ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి ఎం. రాము, హౌసింగ్ ఏఈ ఉమేష్ కుమార్, గ్రామ ఉప సర్పంచ్ అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేష్ గొండ, బసవరాజ్ పటేల్, సురేష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, భారద్వాజ్, వార్డ్ సభ్యులు, సంగ్రామ్, మలుగొండ, రాధాబాయి,షేక్ పర్వీన్, హైదర్ సాబ్, బీరుగొండ, ఉపాధి హామీ ఐకెపి, వివో బి. భాస్కర్, సచిన్, ఇందిరమ్మ గృహ లబ్ధిదారు లాలోజి, అంజమ్మ, రాములు, గ్రామ చిన్న పెద్దలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సురేష్ గొండ మాట్లాడుతూ.. పేదవారి ఇల్లు నిర్మాణం మంజూరులో మన జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు అడిగిన వెంటనే అర్హులైన వారందరికీ ఎంతమంది ఉన్నా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, మా గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు అడుగా 31 మంజూరు చేసినందుకు ఈ సందర్భంగా బస్వాపూర్ గ్రామపంచాయతీ పాలకవర్గం తరఫున గ్రామ ప్రజలందరికీ తరఫున ఎమ్మెల్యే సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. లబ్ధిదారులందరూ మిగిలిన వాళ్ళందరూ తొందరలో పూర్తి చేయాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు.



