– అంగన్వాడీ పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించాలి
– సీఐటీయూ నాయకురాలు రాధ
నవతెలంగాణ – అశ్వారావుపేట
అంగన్వాడి ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలని, బకాయి వేతనాలు విడుదల చేయాలని హైదరాబాదులో ధర్నా నిర్వహిస్తున్న సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగుల భాస్కర్ తో సహా అంగన్వాడి నాయకత్వాన్ని అరెస్ట్ చేయడం ప్రజాస్వామిక చర్య అని అంగన్వాడి టీచర్స్ హెల్పర్స్ యూనియన్ మండల నాయకురాలు కట్టా రాధ అన్నారు.
రాష్ట్ర బడ్జెట్లో ఐసీడీఎస్ కు సరిపడా నిధులు కేటాయించి వేతనాలు పెంచాలని కోరుతూ స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం రికార్డ్ అసిస్టెంట్ కిరణ్ కు సోమవారం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా రాధ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారం లో కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కు రూ.18 వేలు వరకు వేతనాలు పెంచుతామని,చట్టబద్ధ సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చి హామీల అమలు చేయటం కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయింది అని అన్నారు.సమ్మె కాలపు వేతనాలు,రిటైర్మెంట్ బెనిఫిట్స్, మినీ టీచర్స్ ఏరియర్స్,పీఆర్సీ ఏరియర్స్ తదితర బిల్లులు ఏళ్ళతరబడి పెండింగ్ లో ఉండటం వల్ల అంగన్వాడి ఉద్యోగులు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.మే నెల అంతా అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కు ఇద్దరికీ ఒకేసారి సెలవు అమలు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ మండల నాయకులు కృష్ణవేణి,రాజేశ్వరి,లక్ష్మి,విజయ, ముత్తమ్మ,వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.



