79 485 రికవరీకి ఆదేశం..
డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాస్..
నవతెలంగాణ – చిన్నకోడూరు
గ్రామాల్లో చేపట్టిన ఉపాధి హామీలోపనులు చేయకుండానే మస్టర్లు రూపొందించి నిధులు కాజేసినట్లు అధికారుల పర్యవేక్షణ లోపించినట్లు రికార్డుల నిర్వహణ సక్రమంగా లేనట్లు అధికారులు గుర్తించారు. చిన్నకోడూరులో సోమవారము నిర్వహించిన ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీలో పలువురు అక్రమాలు బహిర్గతమయ్యాయి. అడిషనల్ డిఆర్డిఓ శ్రీనివాస్ సామాజిక తనిఖి బృందం అధికారులు మండలంలో రూ.6•83 కోట్ల వ్యయంతో 2024 ఏప్రిల్ ఒకటి నుంచి 2025 మార్చ్ 31 వరకు చేపట్టిన 967 రకాల పనులపై తనిఖీ బృందం ప్రజావేదికలో వెల్లడించింది అక్రమాలకు పాల్పడిన వారినుంచి రూ. 79,485 రికవరీకీ ఆదేశించినట్లు తెలిపారు. రూ 46,వేలు పైన్ విధించినట్లు తెలిపారు.ఈకార్య క్రమంలో క్వాలిటీ కంట్రోల్ సంతోష్ రెడ్డి, విజిలెన్స్ ఆఫీసర్ గణేష్, డీజే బ్రహ్మం, ఎంపీడీవో జనార్ధన్, ఏపీవో రమేష్, ఈసీ రవి తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి హామీలు అక్రమాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



