Monday, March 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎంపీ సహకారంతో శ్రీరామగిరిలో సీసీ రోడ్లు ప్రారంభం 

ఎంపీ సహకారంతో శ్రీరామగిరిలో సీసీ రోడ్లు ప్రారంభం 

- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాలు పల్లెలు అభివృద్ధి
శ్రీరామగిరి గ్రామ సర్పంచ్ మాదరి ప్రశాంత్ 
నవతెలంగాణ- నెల్లికుదురు 

మండలంలోని శ్రీరామగిరి గ్రామ శివారు వెంకటాపురం లో ఎంపీ బలరాం నాయక్ సహకారంతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించినట్లు ఆ గ్రామ సర్పంచ్ మాధరి దరి ప్రశాంత్ తెలిపారు. ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధుల ద్వారా ఐదు లక్షలతో 11వ వార్డులో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక అన్ని గ్రామాలలో బురద మాయం లేకుండా ఉండేందుకు గ్రామాలకు లక్షలాది రూపాయల కేటాయించి సిసి రోడ్లను వేయిస్తున్న ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు.

గ్రామంలో ప్రజలకు మౌలిక వసతులను కల్పించడమే నా లక్ష్యం అని అన్నారు. ప్రజలకు త్రాగునీరు వీధిలైట్లు సీసీ రోడ్లు సైడ్ కాలువలు విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం పాఠశాలలు గ్రంథాలయాలు సాగునీరు తోపాటు ఇంకా కొన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేపిస్తామని అన్నారు. అవసరమైతే మా పై ప్రజాప్రతినిధులు దగ్గరికి వెళ్లి అధిక నిధులు తీసుకు వచ్చి గ్రామాన్ని అన్ని రంగాలుగా ప్రజలకు అన్ని అందుబాటులో ఉండే విధంగా అభివృద్ధి పనులు చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు. గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రామగిరి సుమన్, వార్డు సభ్యులు గంజి ఉమా గోవర్ధన్,  పంజాల పుష్ప యాకన్నా,సంద కృష్ణ లలిత,కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు బెల్లి నర్సయ్య,సీనియర్ నాయకులు మద్దెల సమ్మయ్య, బుర్ర సోమిరెడ్డి, మేరుగు యాకన్నా,డోనికాని మల్లయ్య, ఆవుల వెంకన్న,పోతారాజ్ శ్రీశేలం, యాకన్నా,మేరుగు వీరన్న,బుర్ర కరుణాకర్, గొనె అరుణ్,జంపాల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -