ట్రంప్-జిన్పింగ్ సమావేశానికి మార్గం సుగమం!
ప్యారిస్ : ప్రపం చంలోని రెండు అతిపెద్ద ఆర్థిక శక్తులైన అమెరికా, చైనా మధ్య వాణిజ్య సంబంధాలను మెరుగు పర్చేందుకు జరుగు తున్న చర్చలు ప్యారిస్లో కీలక దశకు చేరుకు న్నాయి. ఈ చర్చలు త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య సమావేశానికి పునాది వేయనున్నాయని సమాచారం. ప్యారిస్లోని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) ప్రధాన కార్యాలయంలో అమెరికా, చైనా ప్రతినిధులు ఆరు గంటలకు పైగా చర్చలు జరిపారు. ఈ చర్చలకు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్, చైనా ఉప ప్రధాని హి లిఫెంగ్ నేతృత్వం వహించారు. ఈ చర్చల్లో ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, కీలక ఖనిజాల సరఫరా, పెట్టుబడులు, వాణిజ్య సహకారం వంటి అంశాలపై చర్చ జరిగింది. చైనా.. అమెరికా నుంచి పౌల్ట్రీ, బీఫ్, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను మరింతగా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని సమాచారం. అలాగే ఇప్పటికే ఉన్న ఒప్పందం ప్రకారం వచ్చే మూడేండ్ల పాటు ప్రతి సంవత్సరమూ సుమారు 25 మిలియన్ టన్నుల అమెరికన్ సోయాబీన్స్ కొనుగోలు చేయడానికి చైనా కట్టుబడి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంకా కీలక ఖనిజాల సరఫరాపై కూడా చర్చలు జరిగాయి. ముఖ్యంగా విమాన ఇంజిన్ తయారీలో ఉపయోగించే ఇట్రియం వంటి రేర్ ఎర్త్ ఖనిజాల సరఫరా విషయంలో అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు రెండు దేశాలు కొన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్టు సమాచారం.
అలాగే వాణిజ్య సమస్యలను నిర్వహించేందుకు కొత్త వ్యవస్థలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా చర్చకు వచ్చింది. ఇందులో ‘బోర్డ్ ఆఫ్ ట్రేడ్’, ‘బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్’ అనే రెండు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసే అంశంపై చర్చ జరిగింది. ఇవి రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయని భావిస్తున్నారు. అయితే ఈ చర్చలు ఎంత వరకు ఫలితాలు ఇస్తాయో అనేది త్వరలో జరగనున్న ట్రంప్, జిన్పింగ్ సమావేశంలో స్పష్టమవుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్థిరంగా ఉన్న ప్రస్తుతం సమయంలో ఈ చర్చలు విజయవంతమైతే.. ఆర్థిక వ్యవస్థకు కొంత స్థిరత్వం రావొచ్చని వివరిస్తున్నారు.
ప్యారిస్లో కీలక దశకు అమెరికా-చైనా వాణిజ్య చర్చలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



