Wednesday, March 18, 2026
E-PAPER
Homeజాతీయంప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొడదాం

ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొడదాం

- Advertisement -

మోడీ అమలు చేస్తున్న సంస్కరణలతో సంపన్నులకే ప్రయోజనం : సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి ఎంఏ బేబీ
నోయిడా : న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో 24న జరగనున్న ‘జన్‌ ఆక్రోశ్‌ ర్యాలీ’ సన్నాహాల్లో భాగంగా ఉత్తరాది రాష్ట్రాల్లో సీపీఐ(ఎం)తో పార్టీ అనుబంధ సంస్థలన్నీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం నోయిడాలోని బరౌలాలో ఉన్న నోయిడా పార్కులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్‌. అరుణ్‌ కుమార్‌, ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి అనురాగ్‌ సక్సేనా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బ్రిజేశ్‌, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆశా యాదవ్‌ ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జరిగే ఈ ‘జన్‌ ఆక్రోశ్‌ ర్యాలీ’లో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. నాలుగు లేబర్‌ కోడ్‌ల వల్ల కలిగే ప్రమాదాలు, శ్రామిక వర్గంపై వాటి ప్రభావం గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో.. ‘జన నాట్య మంచ్‌’ ప్రదర్శించిన ‘లేబర్‌ కోడ్‌ కా ఫందా’ అనే వీధి నాటకంతో ఈ సభ ప్రారంభమైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -