నవతెలంగాణ-హైదరాబాద్ : ఇండియన్ ఆర్మీ భాగస్వామంతో జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ వారి ‘ శౌర్య విజయ యాత్ర కార్గిల్ విజయ్ దివస్ నాడు డ్రాస్ లోని కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం వద్ద ముగిసింది. న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రారంభమైన ఈ 1,900 కిమీ యాత్ర ముగిసింది. పదవిలో ఉన్న, విశ్రాంత రక్షణ సిబ్బంది, వీర నారీలు, అమరవీరుల కుటుంబాలు మరియు పౌర వాహనదారులతో కలిసి ఈ యాత్ర సాహసం, అంకిత భావం మరియు ఉన్నతమైన త్యాగాలు చేసిన 1999 కార్గిల్ యుద్ధ వీరులకు నివాళులు అర్పించింది.
జాతీయ యుద్ధ స్మారకం నుండి కార్గిల్ యుద్ధ స్మారకం వద్దకు పవిత్రమైన మట్టిని లాంఛనప్రాయంగా తీసుకువచ్చిన కీలకమైన ఘటన యాత్రలో ప్రధానాంశంగా నిలిచింది. జాతి స్వాతంత్ర్యాన్ని కాపాడటానికి తమ అచంచలమైన నిబద్ధతను కొనసాగించిన భారత సైన్యం యొక్క తర తరాలను ఇది ప్రతీకాత్మకంగా అనుసంధానం చేసింది.
యాత్రలో పాల్గొన్న వారు హిమాచల్ ప్రదేశ్ మరియు లడఖ్ వంటి కఠినమైన భూభాగాలు ద్వారా ప్రయాణించి డ్రాస్ కు రావడానికి ముందు చండీ మందిర్, రెజంగ్ లా మరియు లే యుద్ధ స్మారకం సహా కీలకమైన మిలిటరీ కట్టడాల వద్ద నివాళులు అర్పించారు. ఈ యాత్ర కేవలం ఒక స్మారక యాత్రగానే కాకుండా భారతదేశపు సాయుధ దళాలు మరియు వారు ప్రతిబింబించే విలువలు యొక్క శాశ్వతమైన వారసత్వానికి జ్ఞాపకంగా కూడా నిలిచింది.
2021లో ఇది ప్రారంభమైన నాటి నుండి, జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ రూపొందించిన ఈ యాత్రను భారతీయ సైనికుల గాథలను కేవలం సైనిక వర్గాలకు మాత్రమే పరిమితం చేయకుండా ప్రజలు అందరి వద్దకు తీసుకువెళ్లడానికి కృషి చేస్తోంది. రైడింగ్ వర్గాల సభ్యులు, మాజీ అధికారులు, పదవిలో ఉన్న సిబ్బంది, వీర నారీలు మరియు అమరవీరుల కుటుంబాలను అనుసంధానం చేయడం ద్వారా, ఈ కార్యక్రమం ఒక విలక్షణమైన సివిల్-మిలిటరీ ఉద్యమంగా అభివృద్ధి చెందింది మరియు ధైర్యం, విధి నిర్వహణ మరియు భావి తరాల కోసం నిస్వార్థమైన సేవా స్ఫూర్తిని పొందుపరచడానికి అంకితమైంది.
ఈ ఏడాది యాత్రను రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు, కార్యక్రమానికి సీనియర్ మిలిటరీ అధికారులు, మాజీ అధికారులు మరియు ఆహ్వానిత అతిథులు హాజరయ్యారు. ఇది కార్యక్రమం యొక్క ప్రాధాన్యతను మరియు ప్రజల జ్ఞాపకాన్ని పోషించడంలో పెరుగుతున్న దాని బాధ్యతను సూచించింది.
జావా 350, జావా 42, జావా 42 FJ, జావా అడ్వెంచర్ మరియు యెజ్డీ స్క్రాంబ్లర్ సహా జావా మరియు యెజ్డీ మోటార్ సైకిల్స్ శ్రేణితో ఈ యాత్ర ఎత్తైన ప్రాంతాలు, సమస్యాత్మకమైన పర్వత మార్గాలు మరియు భారతదేశంలో అత్యంత ముఖ్యమైన మిలిటరీ ప్రాంతాలను దాటి పూర్తి చేయబడింది. ఈ సందర్భం యొక్క స్ఫూర్తికి తగిన విధంగా, సవాలుతో కూడిన ప్రయాణం చేయడానికి మోటార్ సైకిళ్లు రైడర్స్ కు వీలు కల్పించాయి.
అనుపమ్ థరేజా, సహ-స్థాపకులు, క్లాసిక్ లెజెండ్స్, ఇలా అన్నారు:
“శౌర్య విజయ్ యాత్ర అనేది భారతదేశపు సాహసవీరుల గాథలు భావి తరాలకు స్ఫూర్తిని ఇవ్వడం కొనసాగించడానికి ఒక మార్గం. జాతీయ యుద్ధ స్మారకం నుండి డ్రాస్ వరకు, ఈ యాత్ర యొక్క ప్రతి కిలోమీటరు దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన వారి గౌరవార్థం అంకితం చేయబడింది. భారత సైన్యం మరియు విస్తృత రైడింగ్ వర్గంతో కలిసి ఈ నివాళి కార్యక్రమం చేపట్టడం మాకు గర్వ కారణం. పదవిలో ఉన్న వారు మరియు విశ్రాంత రక్షణ సిబ్బంది, వీర నారీలు మరియు పౌర వాహనదారులను అనుసంధానం చేయడం ద్వారా సాహసం, సేవ మరియు జాతి గౌరవం తర తరాలుగా ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని మేము ఆశిస్తున్నాము. “
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా వాహనదారులు కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద సమావేశమైన కారణంగా, సౌర విజయ యాత్ర భారతదేశపు అమరవీరుల వారసత్వం తర తరాలుగా ప్రజలకు స్ఫూర్తిని కలిగిస్తూనే ఉండటానికి మరియు కార్గిల్ స్ఫూర్తి దేశ ప్రజల ఉమ్మడి జ్ఞాపకంగా నిలిచిపోయేలా నిర్థారించే తన శాశ్వతమైన ఉద్దేశ్యాన్ని పునరుద్ఘాటించింది.


