Thursday, March 19, 2026
E-PAPER
Homeజాతీయంతమిళనాడు అసెంబ్లీ పోల్స్‌లో సర్దుబాటు

తమిళనాడు అసెంబ్లీ పోల్స్‌లో సర్దుబాటు

- Advertisement -

– కాంగ్రెస్‌ 28, సీపీఐ 5 సీట్లలో పోటీ
చెన్నై :
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల ఏప్రిల్‌ 23న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. అధికారంలో ఉన్న డీఎంకే పార్టీతో సీపీఐ, కాంగ్రెస్‌ సీట్ల సర్దుబాటు చేసుకున్నాయి. ఈ ఎన్నికల్లో సీపీఐ ఐదు స్థానాల్లో పోటీ చేయనుంది. తాజాగా డీఎంకే అధ్యక్షులు ఎం.కె స్టాలిన్‌తో తమిళనాడు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం. వీరపాండియన్‌తో చర్చలు జరిపిన అనంతరం ఈ సీట్ల సర్దుబాటు జరిగింది. ఇక డీఎంకే కూటమిలో మరో పార్టీ కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో 28 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది. ఇక ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ స్థాపించిన మరుమలార్చి ద్రవిడ మునేట్ర కజగం (ఎంఎడీఎంకే) పార్టీ నాలుగు స్థానాల్లో పోటీ చేయనుంది.కాగా, తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్‌ 23న ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -