- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులతో పాటు, ఎన్నికల్లో పోటీకి కనీస వయోపరిమితిని 25 ఏండ్ల నుంచి 21 సంవత్సరాలకు తగ్గించే ప్రతిపాదనపై చర్చించే అవకాశముంది. రైతులు, నిరుద్యోగం, సాగునీరు తదితర ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి.
- Advertisement -



