Thursday, March 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపోరాటాల ద్వారానే హక్కులు సాధిస్తాం

పోరాటాల ద్వారానే హక్కులు సాధిస్తాం

- Advertisement -

పీయూ వైస్‌ ఛాన్సలర్‌ జిఎన్‌.శ్రీనివాస్‌
ముగిసిన ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణరాష్ట్ర యూనివర్సిటీల కన్వెన్షన్‌
నవతెలంగాణ- మహబూబ్‌నగర్‌

పరిశోధన కేంద్రాలుగా కొనసాగుతున్న విశ్వవిద్యాలయాల్లో.. నేడు పోరాటాల ద్వారానే హక్కులు సాధించబడతాయని పాలమూరు విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ జిఎన్‌.శ్రీనివాస్‌ అన్నారు. పీయూలో జరిగిన రెండో రోజు ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీల కన్వెన్షన్‌ బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో విద్యార్థుల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేయడంలో ఎస్‌ఎఫ్‌ఐ ముందుందని చెప్పారు. చదువులో ముందంజలో ఉంటూ.. సమాజంలో జరుగుతున్న ప్రతి అన్యాయాన్నీ ప్రశ్నిస్తూ ”అధ్యయనం- పోరాటం” నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు.

ఆహ్వాన సంఘం అధ్యక్షులు డాక్టర్‌ మధుసూదన్‌ రెడ్డి, మాజీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బెక్కం జనార్ధన్‌ మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ఎస్‌ఎఫ్‌ఐ నిరంతరం పోరాడుతుందని చెప్పారు. విశ్వవిద్యాలయాల్లో అనేక ఆటుపోట్లు నెలకొంటున్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకోకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటలాడుతున్నాయని విమర్శించారు. ఈ ఆధునిక సమాజంలో ప్రతి విషయాన్నీ విద్యార్థులు క్షుణ్ణంగా పరిశీలించి పోరాటాల్లో పాల్గొనాలని సూచించారు.

విశ్వవిద్యాలయాలు అంటేనే మేధావులను పుట్టించే పరిశ్రమలని, ఆ విధంగా విద్యార్థులంతా ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పారు. మారుతున్న కాలం, పెరుగుతున్న పోటీ, సమస్యలకు ఎదురీదలేక రాజీ పడుతున్న విద్యార్థులను చైతన్యం చేయాల్సిన బాధ్యత ఎస్‌ఎఫ్‌ఐపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ సహాయ కార్యదర్శి అతిక్‌ అహ్మద్‌, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రజనీకాంత్‌, నాగరాజు, రాష్ట్ర యూనివర్సిటీల కన్వీనర్‌ మమత, రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్‌, ప్రశాంత్‌, అశోక్‌ రెడ్డి, శంకర్‌, సహాయ కార్యదర్శులు దీపిక, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనాథ్‌, భరత్‌, పాలమూరు యూనివర్సిటీ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు రాజేష్‌, రాము పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -