నవతెలంగాణ-హైదరాబాద్ : ఫోన్ ఎక్కువగా చూడొద్దని తల్లిదండ్రులు మందలించినందుకు.. ఓ విద్యార్థిని నీటిట్యాంకు ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించింది. ఎంతమంది నచ్చజెప్పినా వినలేదు. విషయం తెలుసుకున్న కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్కలెక్టర్ తక్షణమే గ్రామానికి చేరుకున్నారు. తనే స్వయంగా 60 అడుగుల ట్యాంకుపైకి ఎక్కి, విద్యార్థినికి కౌన్సెలింగ్ చేసి, కిందికి తీసుకొచ్చారు. దీంతో తొమ్మిదిన్నర గంటలపాటు కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. పోలీసులు తెలిపిన ప్రకారం… మహ్మద్నగర్ మండలం బూర్గుల్ గ్రామానికి చెందిన స్రవంతి అనే విద్యార్థిని ఇందల్వాయి గురుకులంలో ఇంటర్ చదువుతూ ఇటీవల ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసింది. ప్రస్తుతం ఇంట్లో ఉంటున్న ఆమె తరచూ ఫోన్ చూస్తుండటంతో తల్లిదండ్రులు బుధవారం రాత్రి మందలించారు. మనస్తాపం చెందిన స్రవంతి చనిపోతానంటూ.. గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఇంటికి సమీపంలోని నీటి ట్యాంకు మెట్లను సగం వరకు ఎక్కింది. తల్లిదండ్రులు, సర్పంచి ఆమెను సముదాయించినా వినకపోవడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులను చూసి భయంతో స్రవంతి ట్యాంకును పూర్తిగా ఎక్కి.. దూకుతానంటూ బెదిరించింది. రాత్రి 8 గంటల సమయంలో సబ్కలెక్టర్ కిరణ్మయి బాన్సువాడ నుంచి బూర్గుల్కు వచ్చారు. బాలికతో మాట్లాడుతూనే.. నెమ్మదిగా తనే మెట్లు ఎక్కుతూ పైకి చేరుకున్నారు. తల్లిదండ్రులు ఏమీ అనకుండా భరోసాగా ఉంటానంటూ స్రవంతికి భరోసా ఇచ్చి.. ట్యాంకు నుంచి కిందికి దించారు.
విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. కాపాడిన సబ్కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



