- Advertisement -
కిలో రూ.550 లకు విక్రయించిన వ్యాపారులు
నవతెలంగాణ-అచ్చంపేట
విశాఖ పట్టణం నుంచి కొందరు చేపల వ్యాపారులు బుధవారం అచ్చంపేటకు ట్యూనా అనే సముద్రపు చేపలు విక్రయించడానికి తీసుకొచ్చారు. ఒక్కొక్క చేప 60 కిలోల పైగా ఉంటుంది. కిలో రూ.550 వ్యాపారులు విక్రయించారు. పట్టణ ప్రజలు చేపలు కొనుగోలు చేయడానికి ఎగబడ్డారు ఆసక్తి చూపారు. చేప మాంసంలో ఉండే పోషకాల గురించి మనిషి బరువులు నియంత్రంచడంలో గుండె జబ్బులను నియంత్రించడంలో ఈ చేప మాంసం చాలా పని చేస్తుందని వ్యాపారులు వినియోగదారులకు వివరిస్తున్నారు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి ఈ చేప మాంసం చాలా ఉపయోగపడుతుందన్నారు.
- Advertisement -



