- Advertisement -
కిలో రూ.550 లకు అమ్మిన వ్యాపారులు
నవతెలంగాణ -అచ్చంపేట
విశాఖ నుంచి కొందరు చేపల వ్యాపారులు బుధవారం అచ్చం పేటకు ట్యూనా అనే సముద్రపు చేపలు విక్రయించడానికి తీసుకొచ్చారు. ఒక్కొక్క చేప 60 కిలోల పైగా ఉంటుంది. కిలో 550 రూపాయల చొప్పున వ్యాపారులు విక్రయించారు. పట్టణ ప్రజలు చేపల్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. మనిషి బరువు, గుండెజబ్బులను నియంత్రించే పోషకాలు ట్యూనా చేప మాంసంలో ఉంటాయని వ్యాపారులు వినియోగదారులకు వివరించారు. శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును తగ్గించడానికి ట్యూనా చేప మాంసం చాలా ఉపయోగపడుతుందని చెప్పడంతో జనం ఎగబడి కొనుగోలు చేశారు.
- Advertisement -



