- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకంపై వదంతులు నమ్మొద్దని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పి.గౌతమ్ అన్నారు. ‘క్యూర్’ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేస్తే ఇతర పథకాలు నిలిచిపోవని స్పష్టం చేశారు. ఇతర ప్రయోజనాలు నిలిచిపోతాయనే ప్రచారంలో నిజం లేదన్నారు. ఇతర పథకాలపై ఎలాంటి ప్రభావం ఉండదని వివరించారు. స్థలం లేనివారికి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు.
- Advertisement -



