నవతెలంగాణ- భువనగిరి కలెక్టరేట్
మండలంలోని తాజ్ పూర్ గ్రామానికి చెందిన పేద ముస్లిం ఒంటరి మహిళ అయిన షేక్ అమీనాబి ఆవాసం లేక చాలా ఇబ్బంది పడుతుంటే ఆమె పరిస్థితి చూసి ఆమెకోసం గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్, ఆర్ ఎస్ కె ఫౌండేషన్ ద్వారా స్వంత ఖర్చుతో సామాజిక వేత్త డా,ర్యాకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంటిని నిర్మించి ఇచ్చి చేయూతనిచ్చారు.
ఆ ఇంటిని రంజాన్ పర్వదినం సందర్బంగా ఈ రోజు ఆ మహిళ తో గృహప్రవేశ కార్యక్రమం ఏర్పాటు చేయించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఎల్లవేళలా నా సహాయ సహకారాలు ఉంటాయని, గ్రామ ప్రజల శ్రేయస్సే తన ముఖ్య కార్యాచరణ అని, ఈ సందర్బంగా వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సామాజిక వేత్త డా, ర్యాకల శ్రీనివాస్, ఉపసర్పంచ్ వరిగంటి కృష్ణ, వార్డు సభ్యులు పల్లెపాటి కృష్ణ, మహ్మద్ గాలిబీ యాకుబ్, బొమ్మారపు రామక్రిష్ణ, బొమ్మారపు లక్ష్మి బాలరాజ్, బీట్కూరి మహేష్, ఓరుగంటి మానస నాగరాజు, స్థానిక వార్డు సభ్యులు షేక్ అహ్మద్, గ్రామ పెద్దలు, యువకులు, మైనారిటీ సోదరులు పాల్గొన్నారు.



