- చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్
నవతెలంగాణ-మునుగోడు: చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మార్చి 25న ఇందిరాపార్క్ దగ్గర మహా ధర్నా జయప్రదం చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ పిలుపునిచ్చారు. సోమవారం మునుగోడు మండల కేంద్రంలో చేనేత కార్మికులతో కలిసి మహా ధర్నా కరపత్రాన్ని ఆవిష్కరించారు . . ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ.. పోరాటాల ఫలితంగా సాధించుకున్న పథకాలైన జాతీయ చేనేత బోర్డు, హాండిక్రాఫ్ట్ బోర్డు, మహాత్మా గాంధీ బునకర్ భీమా యోజన, ఐసిఐసిఐ లాంబార్డ్ హెల్త్ స్కీమ్, హౌస్ కమ్ వర్క్ షెడ్ పథకాలను అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రద్దు చేసిందని, కేంద్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమ ముడి సరుకులైన రంగులు, రసాయనాలతో పాటు చేనేత చీరలపై జియస్టి విధించి దేశ వ్యాప్తంగా చేనేత పరిశ్రమను చావు దెబ్బ తీసిందని ఆరోపించారు. తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికయిన కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్న రుణమాఫీ చేస్తానని ప్రకటించి ఏడాదిన్నర తరువాత తెలంగాణా చేనేత కార్మిక సంఘం పోరాటాల ఫలితంగా ఋణమాఫీ అమలు అయ్యింది. జియోటాగ్ ఉండి మరణించిన చేనేత కార్మికుల కుటుంబాలకు సంవత్సరం దాటినా నేటికీ నేతన్న భీమా, ఎక్స్రేషియా రాలేదు.
స్వాతంత్య్రంనకు స్ఫూర్తి నిచ్చిన సహకారోద్యమం తుంగలో తొక్కి 13 సంవత్సరాల నుండి ఎన్నికలు నిర్వహించకుండా చేనేత పారిశ్రామిక సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ రుణాలను మాఫీ చేయకుండా తాళాలు వేసే దారుణమైన స్థితికి తెచ్చి చేనేత పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వేలాది చేనేత కార్మికుల కుటుంబాలను వీధుల పాళేస్తూ వ్యవహరిస్తున్నదని అనేక సంధార్భాలలో అనేక పర్యాయాలు తెలంగాణ చేనేత కార్మిక సంఘం తరపున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి చర్చలు జరిపినా పథకాలకు డబ్బులు కేటాయించకుండా చేనేత పరిశ్రమ, చేనేత కార్మికుల పట్ల నిర్లక్షంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. జియోటాగ్ ఉన్న చేనేత కార్మికులందరికి ఎలాంటి షరతులు లేకుండా చేనేత భరోసా పథకంలో జియో టాగ్ ఉన్న కార్మికుడికి నెలకు 2000 రెండు వేలు అనుబంద కార్మికులు ఇద్దరికి 500 చొప్పున మొత్తం 36 వేలు రూపాయలు అంద చేయాలి.
చేనేత కార్మికులకు అమలు చేస్తున్న త్రిఫ్ట్ పథకంలో చేనేత కార్మికులు నెలల నుండి రికరింగ్ డిపాజిట్ చేస్తున్నా ప్రభుత్వం మాత్రం రెండు నెలలు మాత్రమే డిపాజిట్ చేసి మళ్ళీ వేయలేదు. బకాయి ఉన్న రూపాయలను వెంటనే డిపాజిట్ చేయాలి.2026-27 రాష్ట్ర బడ్జెట్ లో చేనేతకు రెండు వేల కోట్ల రూపాయలు టెక్స్ టైల్స్కు పవర్లూమ్ లకు రెండు వేల కోట్ల రూపాయలు వేరు వేరుగా కేటాయించాలని డిమాండ్ చేశారు. మరణించిన చేనేత కార్మికులకు త్రిఫ్ట్ పథకంతో షరతులు లేకుండా, నేతన్న భీమా, ఎక్స్రేషియా తక్షణం 60సంవత్సరాలు పైబడినవారికి అందజేయాలి. చేనేత పారిశ్రామిక సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ ఋణాలను మాఫీ చేయాలి. క్యాష్ క్రెడిట్ ఋణాలను పునరుద్ధరించాలి.గత 13 సంవత్సరాల నుండి ఎన్నికలు నిర్వహించకుండా ఉన్న చేనేత పారిశ్రామిక సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించి, టెస్కో కు పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాలి.
జియో టాగ్ వేసి ఉన్న మిగత చేనేత కార్మికులకు త్రిఫ్ట్ పథకం అమలు చేయాలి.అర్హులైన చేనేత కార్మికులకు వేస్తున్న జియో టాగ్ నిరంతర ప్రక్రియగా కొనసాగాలి. చేనేత కార్మికులకు అయిదు లక్షల (5,00,000-00) వరకు ఆరోగ్య భీమా సదుపాయం కల్పించాలి. చేనేత కార్మికులకు ఇంటి స్థలంతో బాటు హౌస్ కమ్ వర్క్ షెడ్ లను ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా చేనేత కార్మికులకు వేతనాలను పెంచి అమలు చేయాలి.చేనేత కార్మికులకు పెట్టుబడి సాయం కింద రాయితీతో జీరో వడ్డీతో కొత్త ఋణాలు 5 లక్షలు ఇవ్వాలి. చేనేత కార్మికుల, సహకార సంఘాల వద్ద పేరుకు పోయిన వస్త్ర నిల్వలను ప్రభుత్వం కొనుగోలు చేయాలి.కార్మికులకు ఉపాధి కల్పన కోసం టెండర్ వేయకుండా ప్రభుత్వ రంగ సంస్థలకు ఏక రూప దుస్తులను చేనేత వస్త్రాలనే అందించాలి
గతంలో రేషన్ షాపుల ద్వారా జనతా వస్త్రాలు అందించినట్లుగా చేనేత వస్త్రాలైన చీర, ధోవతి, లుంగీ అందించాలి.గద్వాల జిల్లా రాజోళిలో నల్లగొండ జిల్లా చండూరు, నకిరేకల్ లలో వర్షాలు, వరదల వలన మగ్గం గుంటలలోకి ఊట నీరు వస్తుంది.
చేనేత కార్మికులకు ఉచితంగా స్టాండ్ మగ్గాలతో పాటుగా హౌస్ కమ్ వర్క్ షెడ్ లు నిర్మించి క్లస్టర్ ఏర్పాటు చేయాలి.చేనేత వస్త్రాల పైన, ముడి సరుకులైన నూలు, రంగులు, రసాయనాలపై జీఎస్టీ ఎత్తివేయాలి.వర్క్ టు ఓనర్ పథకం వెంటనే పూర్తి చేసి పవర్ లూమ్ కార్మికులకు అందించాలి. ప్రభుత్వం ఉత్పతి చేస్తున్న వస్త్రాలకు పవర్ లూమ్ కార్మికులకు అనుబంధ కార్మికులకు యారన్ సబ్సిడీ అందించాలి. పవర్ లూమ్ కార్మికులందరికి ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇవ్వాలి.ప్రభుత్వం నుండి రావాలసిన వస్త్ర పరిశ్రమ బకాయిలను వెంటనే చెల్లించాలి. కుటీర పరిశ్రమ కింద ఉన్న పవర్ లూమ్ వారికి తమిళనాడు రాష్ట్రంలో 750 యూనిట్లు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 500 యూనిట్లు ఉచిత విధ్యుత్ పథకం అమలు చేసినట్లుగా తెలంగాణాలో అమలు చేయాలి.చేనేత కార్మికులకు త్రిఫ్ట్ పథకం అమలు చేసినట్లుగా పవర్ లూమ్ కార్మికులకు అమలు చేయాలి. పవర్ లూమ్ కార్మికులు పవర్ లూములు ఇతర పరికరాలు కొనుగులు చేస్తే వాటికి 50 శాతం సబ్సిడీ ఇచ్చి మిగతా 50 శాతం బ్యాంకుల నుండి తక్కువ వడ్డీకి ఋణాలు ఇప్పించాలి.పవర్లూమ్ కార్మికులందరికి ఋణమాఫీ చేయాలి.
ఈ కార్యక్రమంలో మునుగోడు మండల అధ్యక్షులు చెరుకు సైదులు, మునుగోడు పట్టణ అధ్యక్షులు చిలుకూరి మధు, కార్యదర్శి కర్నాటి రాజు, జిల్లా ఉపాధ్యక్షులు మిర్యాల అశోక్, గుర్రం రాందాస్, గంజి నరేందర్, సింగం కృష్ణయ్య, సింగం గిరి, సింగం వెంకటేశం, మిర్యాల మారయ్య, చేనేత కార్మిక సంఘం కార్యవర్గ సభ్యులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.



