Monday, August 3, 2026
E-PAPER
Homeజాతీయంజార్ఖండ్ లో పేపర్ లీక్ కలకలం.. విద్యార్థుల నిరసన

జార్ఖండ్ లో పేపర్ లీక్ కలకలం.. విద్యార్థుల నిరసన

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: 14 వ జేపీఎస్సీ పరీక్ష, జేఎస్ఎస్సీ-సీజీఎల్, ఇతర నియామక పరీక్షలలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని, నియామక సంస్థలలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ …. జార్ఖండ్‌లోని రాంచీలో ఆదివారం నుండి విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

జార్ఖండ్ నియామక పరీక్షలలో జరిగిన అవకతవకలపై నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. 14 వ జేపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలని, ప్రశ్నా పత్రాల లీకేజీలపై విచారణ జరపాలని, రాష్ట్ర నియామక వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తుండటంతో …. ఒక విద్యార్థి నాయకుడు నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఈ ఆందోళనకు బొద్దింక జనతా పార్టీ (సీజేపీ) కూడా మద్దతు పలకడంతో, రాంచీలో కొనసాగుతున్న నిరసనలు మరింత బలపడ్డాయి. ఈ ఆందోళనలో భాగంగా, అభ్యర్థులు రాంచీలో మషాల్ మార్చ్ కూడా నిర్వహించారు. “జేపీఎస్సీ లేదా జేఎస్ఎస్సీ సీజీఎల్ వంటి ఏ పరీక్ష అయినా సరే, ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నాయి,” అని విద్యార్థులు వాపోతున్నారు. విడివిడి పరిపాలనా చర్యలకు బదులుగా, వ్యవస్థాగత సంస్కరణలు, అధిక పారదర్శకత, జవాబుదారీతనం కావాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులతో చర్చలు జరపాలని, పరీక్షల ప్రక్రియలో పారదర్శకతను పాటించేలా చూడాలని, అలాగే ఆరోపించబడుతున్న అవకతవకలపై విచారణ జరపాలని నిరసనకారులు హేమంత్ సోరెన్ ప్రభుత్వాన్ని కోరారు.

students protest

విద్యార్థి నాయకుడు మహతో నిరవధిక నిరాహార దీక్ష ….

పోటీ పరీక్షలలో జరిగిన అవకతవకలకు నిరసనగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో, విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో ఆదివారం నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. మద్దతుదారులను ఉద్దేశించి మీడియాతో మహతో మాట్లాడుతూ …. గత నెలలో 14వ జేపీఎస్సీ ప్రిలిమినరీ టెస్ట్ ఫలితాలు వెలువడిన తర్వాత ఈ ఆందోళన ప్రారంభమైందని తెలిపారు. ” 14వ ప్రాథమిక పరీక్ష (పీటీ) ఫలితాలు గత నెల 2వ తేదీన, అంటే సరిగ్గా నెల రోజుల క్రితం ఇదే రోజున ప్రకటించబడ్డాయి. దీంతో ఈ వివాదం మొదలైంది. మేము జూలై 5న ఈ ఆందోళనను ప్రారంభించి, జూలై 7న గవర్నర్‌ను కలిశాం. జూలై 8న దిష్టిబొమ్మ దహనం నిరసన చేపట్టాం. జూలై 20న ముఖ్యమంత్రిని కలిసి ఆధారాలు సమర్పించడంతో, అధికారిక చర్యలు ప్రారంభమయ్యాయి,” అని మహతో మీడియాకు వివరించారు. వారాల తరబడి నిరసనలు జరుగుతున్నప్పటికీ, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం, జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) తగిన విధంగా పరిష్కరించడంలో విఫలమయ్యాయని మహాతో ఆరోపించారు.

నేటి నుండి ఆహారం తీసుకోవడం మానేస్తున్నా : విద్యార్థి నేత మహతో

“జార్ఖండ్ ప్రభుత్వం, కమిషన్ ప్రస్తుత వైఖరి రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులలో నిరుత్సాహాన్ని కలిగిస్తోంది… విద్యార్థుల మనోధైర్యాన్ని నిలబెట్టడానికి ఈ పోరాటాన్ని తీవ్రతరం చేయడానికి, నేను ఈ రోజు నుండి ఆహారం తీసుకోవడం మానేస్తున్నాను… 14వ పీటీ పరీక్షను రద్దు చేయించడం, టీడీపీఎల్ ఏజెన్సీ నిర్వహించిన అన్ని పరీక్షలపై విచారణ జరిపించడమే మా ప్రాథమిక లక్ష్యం. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు సమర్పించిన తమ డిమాండ్లు నెరవేరే వరకు నిరాహార దీక్షను కొనసాగిస్తా” అని దేవేంద్రనాథ్ మహతో అన్నారు.

నిరసనకారులకు సిజెపి మద్దతు ….

JPSC, JSSC CGL ఇతర నియామక పరీక్షలలో ఆరోపించబడిన అవకతవకలపై విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు బొద్దింక జనతా పార్టీ (CJP) మద్దతు తెలిపింది. తాను నిరసన చేస్తున్న విద్యార్థులతో మాట్లాడి, వారి డిమాండ్లకు మద్దతు తెలిపినట్లు సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రకటించారు. ” JPSC, JSSC నియామక పరీక్షలలోని అవకతవకలకు నిరసనగా జార్ఖండ్‌లో ఆందోళన చేస్తున్న విద్యార్థులతో మాట్లాడాను. జార్ఖండ్‌లోని విద్యార్థులందరికీ CJP అండగా నిలుస్తుంది. వారి డిమాండ్లకు మద్దతు ఇస్తుంది,” అని దీప్కే X పోస్టులో వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -