Thursday, August 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆగష్టు 15న ఇంటింటా తిరంగా జెండా ఎగురవేయాలి: సర్పంచ్

ఆగష్టు 15న ఇంటింటా తిరంగా జెండా ఎగురవేయాలి: సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
ఆగష్టు 15న స్వతంత్ర దినోత్సవం సందర్బంగా ఇంటింటా తిరంగా జాతీయ జెండా ఎగురవేయాలని పెద్ద షాక్కర్గ గ్రామ సర్పంచ్ విశాలాక్షి-రాంపటేల్ ఆ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జాతీయ జెండాలను గురువారం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామస్తులకు పంపిణీ చేశారు. మువ్వన్నెల జాతీయ జెండా ఇంటింటా ఎగురవేసి మన ఖ్యాతిని స్మరించుకోవడం మనందరి బాధ్యత అని సర్పంచ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి లక్ష్మణ్, పంచాయతీ పాలకవర్గం సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -