- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ సీఎం విజయ్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ గత నెల మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ విజయ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే శుక్రవారం విధించింది. దీంతో బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే నిర్ణయానికి తాత్కాలికంగా ఊరట లభించింది.
- Advertisement -



