- Advertisement -
నవతెలంగాణ – వేములపల్లి: వేములపల్లి మండలం అన్నపురెడ్డిగూడెం సమీపంలో శుక్రవారం రెండు కార్లు ఢీకొన్న ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిని చింతలగూడెం గ్రామపంచాయతీ పరిధికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న స్థానికులు క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో చింతకుంట్ల సాయికిరణ్రెడ్డి, అలుగుబెల్లి కిరణ్రెడ్డి, మహేందర్రెడ్డి ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



