నవతెలంగాణ – చౌటకూర్ : మండలంలోని వివిధ గ్రామాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం ఊరురా గ్రామసభలు నిర్వహించారు.ఉప్పరి గూడెం గ్రామంలో మండల తహసిల్దార్ నామాల కిష్టయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుల్తాన్పూర్ గ్రామంలో ఎంపీడీవో కే శంకర్,కొర్పోల్ గ్రామంలో ఆర్ ఐ ప్రమోద్ కుమార్, బొమ్మ రెడ్డి గూడెం గ్రామంలో నయాబ్ తహసిల్దార్ అనుదీప్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రజలకు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక థీమ్స్ పై ప్రజలకు వివరిస్తూ చైతన్యపరిచారు.ఈ కార్యక్రమంలో ఎంపీవో సువర్ణ, శివంపేట గ్రామంలో మండల స్పెషల్ ఆఫీసర్ వసంత కుమారి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నత్తి దశరథ పాల్గొన్నారు. మండల అధికారులు పాల్గొని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, కొత్తగా ప్రవేశపెట్టిన అంగన్వాడి కేంద్రాలలో అల్పాహారం, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఐదు లక్షల ఆరోగ్య భీమా, ఆరోగ్యశ్రీ వంటి పథకాల గురించి ప్రజలకు వివరించారు మండల కేంద్రంలో చౌటకూర్ గ్రామ సర్పంచ్ పార్కల రామ్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు గొల్ల మల్లేశం,రేణుక బాలరాజ్, గీతా రాణి రమేష్, రామచంద్రారెడ్డి, సంధ్యారాణి మల్లికార్జున గౌడ్, పంచాయతీ కార్యదర్శులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, స్పెషల్ ఆఫీసర్లు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




