Thursday, June 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పూర్వ విద్యార్థుల..అపూర్వ సమ్మేళనం 

పూర్వ విద్యార్థుల..అపూర్వ సమ్మేళనం 

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి : ఆదివారం ఎన్నాళ్ళ.. కెన్నాళ్లకో…అన్నట్లుగా 15 ఏండ్లకు… జక్రాన్ పల్లి మండలం అర్గుల్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 2009-2010 పదవ తరగతి పూర్వ విద్యార్థులందరూ అపూర్వ మధురాను భూతులతో ఆత్మీయంగా సమ్మేళనం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఎవరు ఏం చేస్తున్నారని, వారి వారి పిల్లల, వారి కుటుంబాల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. 15 సంవత్సరాల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులందరూ వారి పాఠశాల మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకుంటూ, చదువుకునే సమయంలో జోకులు వేసుకుని నవ్వుకున్న క్షణాలను, తరగతి గదిలో బోధించిన పాఠాలు బోర్ కొట్టిన జ్ఞాపకాలను, తరగతి గదుల్లో నిద్రపోయిన రోజులను, బెంచీల కింద పడుకున్న దినాలను, క్లాసులు ఎగ్గొట్టిన రోజులను, పరీక్షలకు ముందు రాత్రంతా చదువుకున్న తీపి గుర్తులను ఒకరికొకరు పూర్వ విద్యార్థులందరూ నెమరు వేసుకున్నారు. ఆనాడు విద్యాబుద్ధులు నేర్పిన పూర్వ గురువులందరిని సంబురంగా సన్మానించుకున్నారు. తరువాత 15 ఏళ్ల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులందరూ స్టేజిపై చేసిన హంగామా నృత్యాలతో, స్టెప్పులతో దద్దరిల్లిపోయింది. అనంతరం గురువులు పూర్వ విద్యార్థులు అందరూ  కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో 2009-2010 పూర్వ విద్యార్థులు పజ్జు, మహిపాల్, భరత్, కిరణ్, నరసయ్య, బిన్ను, శ్రావణ్, మానస, రమ్య, రాణి, సంగీత, హారిక, నాని, సోనీ(కావ్య), చిన్ని, హరీష, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -