Saturday, April 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పారా క్వాట్ ను వినియోగించొద్దు: ఎంఏఓ

పారా క్వాట్ ను వినియోగించొద్దు: ఎంఏఓ

- Advertisement -

వినియోగంపై 60 రోజుల నిషేధం
నవతెలంగాణ – కాటారం 

నిషేధిత గడ్డి మందు “పారా క్వాట్” ను ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు వినియోగించకూడదని మండల వ్యవసాయ అధికారిణి పూర్ణిమ  హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ మందు విక్రయంపై 60 రోజులపాటు పూర్తి నిషేధం విధించబడిందని ఆమె తెలిపారు.

ఇటీవలి కాలంలో పారా క్వాట్ వాడకం వల్ల పంటలు, మట్టి నాణ్యతపై తీవ్ర ప్రభావం పడటమే కాకుండా, రైతుల ఆరోగ్యానికి కూడా ముప్పు వాటిల్లుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ నిషేధాన్ని ఉల్లంఘించి ఎవరైనా దొంగచాటుగా విక్రయం చేసినా, వినియోగించినా చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

వ్యవసాయ శాఖ అధికారులు గ్రామ స్థాయిలో తనిఖీలు చేపట్టి నిషేధిత మందుల విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. రైతులు అప్రమత్తంగా ఉండి, అనుమతించబడిన గడ్డి మందులను మాత్రమే ఉపయోగించాలని సూచించారు.

అదేవిధంగా, రైతుల ఆరోగ్యం, పర్యావరణ రక్షణ కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి సహకరించాలని పూర్ణిమ విజ్ఞప్తి చేశారు. నిషేధాన్ని ఉల్లంఘించే వారిపై ఎటువంటి ఉపేక్ష ఉండదని ఆమె హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -