- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, రైతు సంఘం అఖిల భారత నాయకులు సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూశారు. ఆయన మృతి పట్ల తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ సంతాపం వ్యక్తం చేసింది. రైతు, వ్యవసాయ కార్మిక ఉద్యమాల్లో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొంది. మల్లారెడ్డి గారి అకాల మరణం ప్రజా ఉద్యమాలకు, వామపక్ష ఉద్యమానికి తీరని లోటని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సంతాపం ప్రకటించింది.
- Advertisement -



