నవతెలంగాణ-హైదరాబాద్: అయోధ్యలోని రామ మందిరానికి అందిన విరాళాలలో జరిగిన అవకతవకలపై కథనం రాసిన జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అరెస్టు నుంచి మధ్యంతర బెయిల్ లభించింది. మంగళవారం కేసు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్లు జయమల్య బాగ్చి, వి. మోహనలతో కూడిన ధర్మాసనం, ఎఫ్ఐఆర్ కాపీని ఉపాధ్యాయ్కు అందజేయాలని ఉత్తర ప్రదేశ్ పోలీసులను ఆదేశించింది. ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని, ఇతర తగిన ఉపశమనాలు కోరుతూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని కూడా కోర్టు అతడిని కోరింది.
ఒక రోడ్-రేజ్ ఘటనకు సంబంధించి ఘజియాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను సవాలు చేస్తూ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతని పిటిషన్ ప్రకారం, ఒక రోడ్-రేజ్ ఘటన అనంతరం అతను ఒక వ్యక్తిపై దాడి చేసి, బెదిరించారన్న ఆరోపణలపై ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది.ఈ కేసు కల్పిత ఆరోపణలపై ఆధారపడి ఉందని, తన స్వతంత్ర పాత్రికేయ కృషి కారణంగా తనను వేధించడానికి, భయపెట్టడానికే ఉద్దేశించబడిందని ఉపాధ్యాయ్ ఆరోపించారు.



