- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని 30 గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాలలో ఆగస్టు 27న ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రత్యేక గ్రామసభలు నిర్వహించాలని తహశీల్దార్ ఆదేశాల మేరకు షెడ్యూల్ ను విడుదల చేసామని సీనియర్ అసిస్టెంట్ మోహన్ తెలిపారు. ఈ గ్రామసభలకు మండలాధికారులకు, సిబ్బందికి నిర్వహణ బాధ్యతలు అప్పగించామనీ, ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభించాలని చెప్పారు. అనంతరం నివేదికలను జుక్కల్ తహశీల్దార్ కార్యాలయంలో సాయంకాలం లోపు అందజేయాలని సూచించారు. గ్రామసభలను నిర్వహించని అధికారులపై శాఖపరమైన చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.
- Advertisement -



