- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: భారీ వర్షాలతో నేపాల్లోని గండక్ నది ఎగువ పరీవాహక ప్రాంతంలో ఆకస్మిక వరదలు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో బీహార్లో ప్రభుత్వం అలర్ట్ అయింది. గండక్ నది తీరంలోని జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం పొంచి ఉంది. ఈక్రమంలో తాజాగా ప్రధాన కార్యదర్శి ప్రత్యయ్ అమృత్ అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. అందుబాటులో ఉన్న నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పడు అంచనా వేయాలని, గండక్ బ్యారేజీ దానికి అనుబంధంగా ఉన్న కాలువల గేట్లన్నింటి ద్వారా నీటిని విడుదల చేయాలని జలవనరుల శాఖ ఆదేశాలు జారీ చేసింది.
- Advertisement -



