- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నేపాల్లో 105 మంది భారతీయులు గల్లంతయ్యారు. రసువా ప్రాంతంలో బుధవారం ఉదయం మెరుపు వరదలు సంభవించాయి. ఇందులో ఇప్పటివరకు 291 మంది విదేశీయులు, 93 మంది నేపాలీలు గల్లంతైనట్లు నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. వీరిలో 105 మంది భారతీయులు ఉన్నట్లు నేపాల్ తెలిపింది. టిబెట్ వైపు నుంచి ఉద్భవించే భోటెకోశీ నదిలో ఈ రోజు ఉదయం ప్రవాహం ఆకస్మికంగా పెరగడంతో పలు గ్రామాలు కొట్టుకుపోయాయి.
- Advertisement -



