మద్యంమత్తులో ఇళ్లలోకి దూసుకెళ్లిన వైనం..
అక్కడిక్కడే ఇద్దరు మృతి..
మరో ఇద్దరికి తీవ్రగాయాలు
నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం) : మద్యంమత్తులో ఓ కారు డ్రైవర్ అదుపుతప్పి ఇళ్లలోకి దూసుకెళ్లాడు. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన కాటారం మండలంలోని గంగారంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, కాటారం పోలీసుల పూర్తి కథనం ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన కారు కాళేశ్వర ముక్తేశ్వర-ముక్తేశ్వర స్వామి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో కాటారం మండలంలోని గంగారం గ్రామంలోకి రాగానే కారు అదుపుతప్పి రోడ్డుకు ప్రక్కనున్న ఇండ్లలోకి దూసుకుపోయింది. దీంతో మరుపాక మదునమ్మ (60), నిలారపు బాలయ్య (55) ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చికిత్స కోసం భూపాలపల్లి జిల్లాలోని వందపడకల ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని కాటారం పోలీసులు పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
గంగారంలో కారు బీభత్సం.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES