నవతెలంగాణ – ముధోల్ : మండల కేంద్రమైన ముధోల్ తోపాటు మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జాతీయపతకం ఎగురవేశారు.మిఠాయిలు పంచి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు ,తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ కె.శ్రీలత ,మండలభివృద్ది కార్యాలయంలో ఎంపిడిఓ శివకుమార్,,మండల విద్యా వనరుల కార్యాలయంలో ఎంఇఓ రమణ రెడ్డి, ముధోల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇఓ అన్వర్, ఐసిడిఎస్ కార్యాలయంలో సిడిపిఓ సరోజిని,పంచాయతీ రాజ్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ అబుల్, వ్యవసాయ పరిశోధనా స్థానం లో ప్రధాన శాస్త్రవేత్త డా.ఇ. నర్సయ్య,పిఎసిఎస్ కార్యాలయంలో చైర్మన్ వెంకటేష్ గౌడ్ ,పొలీస్ స్టేషన్ లో సిఐమల్లేష్ తో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు, గ్రామపంచాయతీ లో కార్యదర్శ లు జాతీయ పతాకాన్ని ఎగురవేసి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు ,అలాగే ప్రభుత్వ పాఠశాల లో ప్రదానోపాద్యాయులు,మండలకేంద్రంలో బీఆర్ యస్అధ్యక్షుడు బి.గంగాధర్ పార్టీ జెండా,జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో నాయకులు అధికారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES