Friday, June 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారా.?

రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారా.?

- Advertisement -

ప్రభుత్వాన్ని నిలదీసిన బిఆర్ఎస్ నాయకులు
నవతెలంగాణ – మల్హర్ రావు
: కిషన్ రావు పల్లి నుంచి భూపాలపల్లి జిల్లా కేంద్రం వరకు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం చేయరాని ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ నాయకులు నిలదీశారు. ఆదివారం పెద్దతూoడ్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు రూ.33.70 లక్షలు తమ నాయకుడు పుట్ట మధు హయాంలో అటవీశాఖకు చెల్లించినట్లుగా తెలిపారు. మిగిలిన రూ.4.70 కోట్లు అటవీశాఖకు చెల్లించాల్సిన సొమ్ము కోసం తమ నాయకుడు, తాము  ఎన్నో పోరాటాలు చేసిన నేపథ్యంలో ఏప్రిల్ 16న కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించినట్లుగా తెలిపారు. అసలు 2017లో రోడ్డు క్లియరెన్స్ కోసం తమ నాయకుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చిన పత్రాన్ని కాంగ్రెస్ నాయకులు తమ నాయకుడే క్లియరెన్స్ చేయించడానికి తప్పుడు ప్రచారాలు చేశారని తెలిపారు.ప్రభుత్వం అందించే బోనస్ తీసుకుంటున్నారనే విమర్శలు స్థానిక నాయకులు చేయడం కాదు,బిఆర్ఎస్ ప్రభుత్వంలో మోకాపై భూములు లేకున్నా లక్షల్లో రైతుబందు పొందినవారు కాంగ్రెస్ నాయకులు కాదని ప్రశ్నించారు.తమ నాయకుడు ఐదేళ్లలో  శాత్రజ్ పల్లి,ఖమ్మంపల్లి, పెద్దతూoడ్ల బ్రడ్జీలతోపాటు మరెన్నో అభివృద్ధి పనులు చేశారని,ఒక్క పారెస్ట్ రోడ్లు చేయడానికి ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం చేయడం తగదన్నారు.కాంగ్రెస్ నాయకులు బాంబులు పెల్సి హడావిడి చేయడం కాదు రోడ్డు పనులు ప్రారంభిస్తే అన్ని వర్గాలు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు నారా రమేష్,నాగేశ్వరరావు, అజ్మీరా సమ్మయ్య నాయక్,జక్కుల లక్ష్మన్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -