నవతెలంగాణ – భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలోని విద్యానగర్ లో సోమవారం డాక్టర్ పెద్దిస్ కంటి ఆస్పత్రిని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు మంచి వైద్యం అందించాలని, అత్యాదునిక పరికరాలతో ఏర్పాటు చేసిన ఆసుపత్రి వైద్య సేవలను జిల్లా ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. కంటి వైద్య నిపుణులు డాక్టర్ పెద్ది సంతోష్ మాట్లాడుతూ నూతన టెక్నాలజీ తో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తామని దీన్ని జిల్లా ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. అనంతరం డా.పెద్ది సంతోష్ ను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబురావు,మున్సిపల్ మాజీ చైర్మన్ పోతంశెట్టిమంజుల వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్ భాష బోయిన రాజేష్, డాక్టర్ సిహెచ్ జగన్మోహన్ రావు, డాక్టర్ వి.రాజలింగం,కాంగ్రెస్ నాయకులు తంగళ్ళపల్లి రవికుమార్, ఆసుపత్రి ఎం డి. పెద్ది మురళి, డైరెక్టర్ పెద్ది.సుకేష్, పసుపునూరి నాగభూషణం, పసుపు నూరి మనోహర్, గడ్డం సోము చంద్, డా. మానవ్, డాక్టర్ మోహన్, డాక్టర్ లింగా కిరణ్, డాక్టర్ విజయ్ శర్మ, డాక్టర్ కరణ్ రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్,డాక్టర్ సంధ్యా మేడం,సుదర్శన్ రెడ్డి, మంచాల రిషికేష్ నూనె వెంకటేష్, అశోక్, భాస్కర్, మందడి ఉపేందర్ రెడ్డి, పాల్గొన్నారు.
డాక్టర్ పెద్దీస్ కంటి ఆస్పత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES