- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్: అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మద్నూర్ ఎస్సై మోహన్ రెడ్డి మండలంలోని సుల్తాన్ పేట్ గ్రామంలో జయంతి వేడుకలకు హాజరైయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్ గ్రామస్తులు, పోలీసులు పాల్గొన్నారు.

- Advertisement -



