Tuesday, April 14, 2026
E-PAPER
Homeనిజామాబాద్బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

- Advertisement -
  • కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో బీఆర్. అంబేద్కర్ జ‌యంతి వేడుక‌లు
    నవతెలంగాణ-మద్నూర్: భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని మద్నూర్, డోంగ్లి, మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దరాస్ సాయిలు, గజానన్ దేశాయ్, కొనియాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇరు మండలాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దరాస్ సాయిలు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పూలమాలలతో సత్కరించి నివాళులర్పించారు. అదేవిధంగా డోంగ్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ మండల పార్టీ అధ్యక్షులు గజానంద్ దేశాయ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇరు మండలాల అధ్యక్షులు మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని పేర్కొన్నారు ఆయన రచించిన రాజ్యాంగం ప్రకారం భారతదేశ ముందుకెళ్తుందని తెలిపారు. ఇరు మండలాల పరిధిలో జయంతి వేడుకల్లో మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్, వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, మిర్జాపూర్ హనుమాన్ టెంపుల్ చైర్మన్ రామ్ పటేల్, మద్నూర్ మాజీ సింగిల్ విండో విండో అధ్యక్షులు శ్రీనివాస్ పటేల్, కొండ గంగాధర్, అదే విధంగా డోంగ్లి మండల కేంద్రంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు యూనుస్ పటేల్, మోగా గ్రామ సర్పంచ్ హాలే బస్వంత్ మాదన్, ఇప్పర్గా గ్రామ సర్పంచ్ బాచావార్ లక్ష్మణ్, దొంగిలి గ్రామ సర్పంచ్ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉమాకాంత్ పటేల్, డోంగ్లి మాజీ ఎంపీటీసీ సభ్యులు దీన్ దయాల్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -