- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తపాలా శాఖ దేశవ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి భారీగా ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 23,757 ఖాళీలు ఉండగా, ఆంధ్రప్రదేశ్లో 917, తెలంగాణలో 419 పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 2 నుంచి 21 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తుల్లో తప్పులను సెప్టెంబర్ 23, 24 తేదీల్లో సరిదిద్దుకోవచ్చు. రూ.100 దరఖాస్తు రుసుముగా నిర్ణయించారు, అయితే మహిళలు, ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులకు మినహాయింపు ఉంది. పదో తరగతి మార్కుల ఆధారంగా నియామకాలు జరుగుతాయి, రాత పరీక్ష ఉండదు.
- Advertisement -



