Friday, June 6, 2025
E-PAPER
Homeసినిమాగద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌లో తెలంగాణ వారికి అన్యాయం జరిగింది

గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌లో తెలంగాణ వారికి అన్యాయం జరిగింది

- Advertisement -

‘థియేటర్స్‌ సమస్యకు పరిశ్రమలోని ఆ నలుగురే కారణం’ అని టీఎఫ్‌సీసీ ఛైర్మన్‌ ప్రతాని రామకష్ణ గౌడ్‌ ఆరోపించారు.
సురేష్‌బాబు, అల్లుఅరవింద్‌, దిల్‌రాజు, ఏషి యన్‌ సునీల్‌.. తమ స్వార్థంతో థియేటర్స్‌, డిస్ట్రిబ్యూషన్‌ వ్యవస్థను నాశనం చేస్తున్నారని, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ అధికారాలను దిల్‌ రాజు దుర్వినియోగం చేసి గద్దర్‌ అవార్డ్స్‌లో తెలం గాణ కళాకారులకు, సాంకేతిక నిపుణులకు అన్యాయం చేశారన్నారు.
సోమవారం టీఎఫ్‌సీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘ఆ నలుగురే..మొత్తం థియేటర్స్‌ను తమ కబంధ హస్తాల్లో పెట్టుకున్నారు. ఒకప్పుడు పర్సంటేజ్‌ వల్ల డిస్ట్రిబ్యూటర్స్‌ అంతా బాగుపడ్డారు. ఈరోజు నష్టాలు వస్తున్నాయి. అందుకే పర్సంటేజ్‌ సిస్టమ్‌ పెట్టాలని మేము నిరాహార దీక్ష చేశాం. ఏపీలో థియేటర్స్‌ వ్యవస్థ ప్రక్షాళనకు పవన్‌కల్యాణ్‌ తీసుకుంటున్న చర్యలను అభినందిస్తున్నాం. ఇక్కడ కూడా అలాంటి చర్యలు చేపట్టాలి. గద్దర్‌ పేరుతో ఇస్తున్న తెలంగాణ అవార్డ్స్‌ జ్యూరీకి మురళీ మోహన్‌, జయసుధను ఛైర్మన్స్‌గా పెట్టడం ఏంటో అర్థం కాలేదు?, తెలంగాణ అవార్డ్స్‌లో తెలంగాణ వారికే ప్రాతినిధ్యం లేకుండా పోవడం బాధాకరం. అంతేకాదు దిల్‌రాజు తన వాళ్లకే అవార్డ్స్‌ ఇచ్చుకున్నాడు. థియేటర్స్‌ బంద్‌ ఇష్యూలో కూడా దిల్‌ రాజు ప్రమేయం ఉంది’ అని అన్నారు. టీఎఫ్‌ సీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, హీరో కిరణ్‌, తెలంగాణ డైరెక్టర్స్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ రమేష్‌ నాయుడు, తెలంగాణ రైటర్స్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ అమత్‌ గౌడ్‌ ఈ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -